IPL New Teams: రెండు కొత్త ఐపీఎల్‌ జట్లను ప్రకటించిన బీసీసీఐ

IPL New Teams: ఐపీఎల్‌ కొత్త టీమ్‌లు అహ్మదాబాద్‌, లక్నో

Update: 2021-10-25 14:32 GMT
ఐపీల్ లో రెండు కొత్త జట్లను ప్రకటించిన బీసీసీఐ (ఫైల్ ఇమేజ్)

IPL New Teams: బీసీసీఐ రెండు కొత్త ఐపీఎల్‌ జట్లను ప్రకటించింది. కొత్తగా ఐపీఎల్‌లో అహ్మదాబాద్‌, లక్నో టీమ్‌లు వచ్చి చేరాయి. దీంతో ఐపీఎల్‌ 2022లో మొత్తం పది జట్లు టైటిల్‌ పోరులో నిలబడనున్నాయి. అహ్మదాబాద్‌ టీమ్‌ను అదానీ గ్రూప్‌. లక్నో టీమ్‌ను ఆర్‌పీఎస్‌జీ గ్రూప్‌ దక్కించుకుంది. అహ్మదాబాద్‌ 5వేల 600కోట్ల రూపాయలకు, లక్నో టీమ్‌ 7వేల 90 కోట్ల రూపాయలకు దక్కించుకున్నాయి. మరో రెండు జట్ల చేరికతో వచ్చే ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ మరింత రసవత్తరంగా సాగనుంది.

Tags:    

Similar News