Smriti Mandhana: స్మృతి మందానను రూ.3.40 కోట్లకు దక్కించుకున్న బెంగళూరు
Smriti Mandhana: స్మృతి మందానను దక్కించుకున్న బెంగళూరు
Smriti Mandhana: స్మృతి మందానను రూ.3.40 కోట్లకు దక్కించుకున్న బెంగళూరు
Smriti Mandhana: మహిళల ఉమెన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది. ప్లేయర్ల కోసం ఐదు టీమ్లు పోటీపడుతున్నాయి. ఈ వేలంలో 409 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అందులో 246 మంది దేశీయ ప్లేయర్లు..163 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. కాగా, టీమ్ఇండియా ప్లేయర్ స్మృతి మంధాన రికార్డు ధర పలికింది. స్మృతి మంధానను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 3.40 కోట్లకు దక్కించుకుంది. భారత జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ను 1.80 కోట్లకు ముంబయి ఇండియన్స్ సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా క్రికెటర్ అస్లీ గార్డ్నర్ కోసం ముంబయి ఇండియన్స్, యూపీ వారియర్స్ జట్లు పోటాపోటీగా బిడ్డింగ్ వేశాయి. చివరకు గుజరాత్ జెయింట్స్ జట్టు 3.20 కోట్లకు సొంతం చేసుకుంది. ఇక, మరో ఆసీస్ ఎలిస్ పెర్రీ కూడా భారీ ధర పలికింది. ఈ క్రికెటర్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 1.70 కోట్లకు దక్కించుకుంది. ఇంగ్లాండ్ ఆల్రౌండర్ సోఫీ ఎక్లెస్టోన్ కోసం యూపీ వారియర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడ్డాయి. ఆఖరుకు యూపీ వారియర్స్ సోఫీ ఎక్లెస్టోన్ను 1.80 కోట్లకు కొనుగోలు చేసింది.