Shikhar Dhawan: విడాకుల విషయంపై ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఆయేషా

Shikhar Dhawan: భార్య ఆయేషా ముఖర్జీతో విడిపోయిన శిఖర్ ధావన్

Update: 2021-09-08 02:51 GMT
ఐష్ ముఖర్జీతో విడాకులు తీసుకున్న శిఖర్ ధావన్ (ఫైల్ ఇమేజ్)

Shikhar Dhawan: భారత క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ తన భార్య ఆయేషా ముఖర్జీతో విడిపోయాడు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది ఆయేషా. వీరిద్దరికి 2012లో వివాహం కాగా... జొరావర్‌ అనే 7 ఏళ్ల కొడుకు ఉన్నాడు. మెల్‌బోర్న్‌కు చెందిన ఆయేషాకు శిఖర్‌తో పరిచయం కాక ముందే పెళ్లయింది. ఆమెకు అప్పటికే ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. అయితే వారిద్దరిని తన పిల్లలుగానే ప్రకటించిన ధావన్‌.. బాధ్యతను కూడా తీసుకొన్నాడు. విడాకుల విషయంపై శిఖర్‌ ధావన్‌ ఇంతవరకు స్పందించలేదు. దాదాపు 8 ఏళ్ల అనంతరం శిఖర్‌ జంట తమ వైవాహిక బంధానికి స్వస్తి పలికింది. 

Tags:    

Similar News