IRE vs IND: ఐర్లాండ్ పర్యటనలో టీమిండియా జైత్ర యాత్ర.. వరుసగా రెండో విజయం

IRE vs IND: స్కోర్లు : టీమిండియా -185/5 ఐర్లాండ్ -152/8

Update: 2023-08-21 02:27 GMT

IRE vs IND: ఐర్లాండ్ పర్యటనలో టీమిండియా జైత్ర యాత్ర.. వరుసగా రెండో విజయం

IRE vs IND: డబ్లిన్‌లో జరిగిన రెండో టీ20మ్యాచ్‌లోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. ఐర్లండ్ పర్యటనలో వరుసగా ఇది రెండో విజయం. మూడు టీ20 మ్యాచ్‌‌లు ఆడేందుకు ఐర్లండ్ వెళ్లిన టీమిండియా... ఇవాళ్టి విజయంతో 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్, రింకూ సింగ్ విజృంభణతో స్కోరు బోర్డు పరుగులు తీసింది. మ్యాచ్ ఆఖరిలో రింకూసింగ్ మెరుపు షాట్లతో విరుచుకుపడ్డాడు. రెండు బౌండరీలు, మూడు సిక్సర్లతో 21 బంతుల్లో 38 పరుగులు అందించాడు.

186 పరుగులు విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ దూకుడుగా కన్పించినప్పటికీ... ఆరంభంలోనే రెండు వికెట్లను కోల్పోయింది. ఆండ్రూ బల్బర్నీ మినహాయిస్తే.. మిగతావాళ్లెవరూ క్రీజులో కాసేపు నిల్చోలేకపోయారు. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్ 152 పరుగులు చేసింది. దీంతో 33 పరుగుల తేడాతో టీమిండియా విజయం చేజిక్కించుకుంది.

మ్యాచ్‌లో పదునైన మెరుపుషాట్లతో ఆకట్టుకున్న రింకూ సింగ్‌ను ప్లేయర్ ఆఫ్ దిమ్యాచ్ అవార్డు వరించింది. మూడో టీ20 మ్యాచ్ ఈ నెల 23 తేదీన జరుగనుంది.

Tags:    

Similar News