Narendra Modi: ఆర్టికల్ 370 రద్దుతో జమ్ము ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది
Narendra Modi: జమ్ముకశ్మీర్లో అభివృద్ధి పనులు ఎట్టి పరిస్థితుల్లో ఆగవు
Narendra Modi: ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్ ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని ప్రధాని మోడీ అన్నారు. శ్రీనగర్లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో 53 ప్రాజెక్టులను ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. తాను ఎల్లప్పుడూ జమ్ముకశ్మీర్ ప్రజలను కుటుంబంలా భావిస్తానని మోడీ చెప్పారు. 'కుటుంబ సభ్యులు నా హృదయంలో ఉంటారు. జమ్ముకశ్మీర్ అభివృద్ధికి హామీ ఇస్తున్నానని చెప్పారు. జమ్ముకశ్మీర్లో అభివృద్ధి పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగవన్నారు