Weather Updates: వచ్చే 24 గంటలు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ

Weather Updates: భారీ వర్షాల కారణంగా దేశంలోని చాలా రాష్ట్రాలను వరదలు ముంచిఎత్తయి. ఎక్కడ చూసినా వరదలే..

Update: 2020-08-23 10:30 GMT

Weather Updates: భారీ వర్షాల కారణంగా దేశంలోని చాలా రాష్ట్రాలను వరదలు ముంచిఎత్తయి. ఎక్కడ చూసినా వరదలే.. గత కొద్ది రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాలలో కుడా భారీ వర్షాలు కురవటంతో రహదారులు నదులను తలపిస్తున్నాయి. అదే సమయంలో, ఈ సోమవారం నుండి పశ్చిమ భారతదేశంలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని కోసం రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో రుతుపవనాలు చురుకుగా మారే అవకాశం ఉండటంతో భారత వాతావరణ శాఖ (ఐఎండి) ఈ హెచ్చరిక జారీ చేసింది.

తూర్పు రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ లకు శనివారం హెచ్చరిక జారీ చేశారు. ఆదివారం జారీ చేసిన హెచ్చరికలో, తూర్పు, పశ్చిమ రాజస్థాన్‌లో భారీ వర్షాలు కురిసేఅవకాశం ఉండగా, సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలకు సోమవారం రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఒడిశా, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బెంగాల్‌లోని దక్షిణ ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మధ్యప్రదేశ్, హోషంగాబాద్, జబల్పూర్, బేతుల్, నర్సింగ్‌పూర్, సియోని, హర్దా జిల్లాల ఆరు జిల్లాలకు ఈ విభాగం రెడ్అ లర్ట్ జారీ చేసింది.

ముంబై, థానే, రాయ్‌గడ్ మరియు కొంకణంలోని ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాలకు ఐఎమ్‌డి 'ఆరెంజ్ అలర్ట్' జారీ చేసింది. తూర్పు మధ్యప్రదేశ్‌పై తుఫాను ప్రవాహం కారణంగా వచ్చే 48 గంటల్లో కొంకణ్ ప్రాంతం, మధ్య మహారాష్ట్రలోని ఘాట్ ప్రాంతాల్లో భారీ నుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాతావరణ శాఖ ప్రకారం, రాబోయే ఒకటి లేదా రెండు రోజుల్లో బెంగాల్ బేలో కొత్త రుతుపవనాలు ఏర్పడవచ్చు. ఇది ఆగస్టులో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయి అని వాతావరణ శాఖ తెలిపింది. 


Tags:    

Similar News