మరోసారి రిపీట్ కానివ్వకండి.. మంత్రి పై వెంకయ్యనాయుడు ఆగ్రహం

Update: 2019-07-19 15:32 GMT

పార్లమెంటుకు హాజరు కాకుండా సభా సమయాన్ని వృథా చేశారంటూ కేంద్ర పశు సంవర్ధక సహాయ శాఖా మంత్రి సంజీవ్‌ కుమార్‌ బలయాన్‌పై ఉప రాష్ట్రపతి... రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఈ తప్పిదం పునరావృతం కావొద్దని హెచ్చరించారు. బుధవారం నాటి ఎజెండాలో మంత్రి పేరు ఉన్నప్పటికీ ఆయన సభకు గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో శుక్రవారం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ. మొన్న మిమ్మల్ని పిలిచినపుడు అందుబాటులో లేరు. భవిష్యత్తులో ఇంకోసారి ఇలా చేయకండి అంటూ బలయాన్ తో వ్యాఖ్యానించారు. 

Tags:    

Similar News