Varanasi: కాశీ యాత్ర వాయిదా వేసుకోమంటున్న యూపీ సర్కార్‌

Varanasi: కాశీకి తీర్థ యాత్ర చేయాలనుకుంటున్న భక్తులు తమ ప్రయాణాలను కొంతకాలం వాయిదా వేసుకోవాలని వారణాసి జిల్లా యంత్రాంగం సూచించింది.

Update: 2021-04-15 16:00 GMT

Varanasi: కాశీ యాత్ర వాయిదా వేసుకోమంటున్న యూపీ సర్కార్‌

Varanasi: కాశీకి తీర్థ యాత్ర చేయాలనుకుంటున్న భక్తులు తమ ప్రయాణాలను కొంతకాలం వాయిదా వేసుకోవాలని వారణాసి జిల్లా యంత్రాంగం సూచించింది. కోవిడ్ రెండో ప్రభంజనం తీవ్రంగా ఉన్నందువల్ల ఈ సలహా ఇస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం వారణాసి జిల్లాలో 10,206 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ నెలలో వారణాసిలోని దేవాలయాలను సందర్శించేందుకు రావాలనుకుంటున్నవారు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ కోరారు. విశ్వనాథ దేవాలయం, సంకట మోచన దేవాలయం, అన్నపూర్ణ దేవాలయాలను సందర్శించేందుకు వచ్చే భక్తులు తప్పనిసరిగా కోవిడ్-19 నెగెటివ్ సర్టిఫికేట్‌ను చూపించాలని చెప్పారు. వారణాసిలో ప్రవేశించడానికి ముందు మూడు రోజుల్లో ఈ సర్టిఫికేట్‌ను పొంది ఉండాలని చెప్పారు.

Tags:    

Similar News