వాహనదరులకి శుభవార్తను అందజేసిన కేంద్రం

దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ నడుస్తున్న సంగతి తెలిసిందే..

Update: 2020-03-31 09:39 GMT
Representational Image

దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ నడుస్తున్న సంగతి తెలిసిందే.. ఈ నేపధ్యంలో కేంద్రం వాహనదరులకి శుభవార్తను అందజేసింది. డ్రైవింగ్‌ లైసెన్స్‌లు, ఇతర రవాణా పత్రాల కాలపరిమితిని జూన్‌ 30 వరకూ పొడగిస్తూ కేంద్ర రవాణా శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

లాక్‌డౌన్ కారణంగా లైసెన్సులు, పర్మిట్లు, ఇతర రవాణా పత్రాలను రెన్యువల్ చేయించుకోవడంలో పౌరులు ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసి కేంరం ఈ నిర్ణయం తీసుకుంది. 1.2 కోట్ల వాహనాలకు ఊరట లభించినట్టయ్యింది.


Tags:    

Similar News