Bharat Jodo Yatra: రాహుల్‌తో కలిసి యాత్రలో పాల్గొన్న రేవంత్ రెడ్డి

Bharat Jodo Yatra: జోడోయాత్ర.. భవిష్యత్ రాజకీయ మార్పునకు సంకేతం

Update: 2022-09-19 15:00 GMT

Bharat Jodo Yatra: రాహుల్‌తో కలిసి యాత్రలో పాల్గొన్న రేవంత్ రెడ్డి

Bharat Jodo Yatra: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు వస్తున్న ప్రజాస్పందన భారత్ భవిష్యత్ రాజకీయ మార్పులకు సంకేతమని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కేరళలో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి రేవంత్ రెడ్డి నడిచారు. యాత్ర ఆద్యంతం ప్రజాధరణ రెట్టింపు ఉత్సాహాన్నిచ్చిందన్నారు. జోడో యాత్రలో చోటుచేసుకున్న ఆసక్తికర పరిణామాలపై కాసేపు ఇరువురూ చర్చించుకున్నారు. భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో విశ్వాసం పెరిగిందనే అభిప్రాయం వ్యక్తంచేశారు.

Tags:    

Similar News