జనవరి 1 నుంచి ఖాతా స్తంభించిపోవచ్చు.. కొత్త నిబంధనలు ఏంటంటే..?

*కొత్త సంవత్సరం నుంచి బ్యాంకు నియమాలు మారబోతున్నాయి

Update: 2021-12-29 07:45 GMT

జనవరి 1 నుంచి ఖాతా స్తంభించిపోవచ్చు.. కొత్త నిబంధనలు ఏంటంటే..?

Account Frozen: కొత్త సంవత్సరం నుంచి బ్యాంకు నియమాలు మారబోతున్నాయి. దీనివల్ల వినియోగదారులకు భారం తప్పడం లేదు. చాలా విషయాలలో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. అందులో ముఖ్యంగా ఏటీఎం నుంచి డబ్బు విత్‌ డ్రా చేయడంలో పరిమితి విధించింది. అంతేకాకుండా KYC అప్‌డేట్‌ చేయకపోతే ఖాతాలు స్తంభించిపోతాయి. డబ్బు డిపాజిట్ విషయంలో, విత్ డ్రా చేయడంలో చార్జీలు పెంచనున్నాయి. ఇంకా చాలా విషయాలలో మారుతున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

మీ బ్యాంక్ ఖాతా KYC చాలా కాలం క్రితం జరిగితే కొత్త సంవత్సరం నుంచి ఖాతా పనిచేయదు. వాస్తవానికి, KYC చెల్లుబాటు నిర్దిష్ట సమయం తర్వాత ముగుస్తుంది. అయితే కరోనా రెండో వేవ్‌ కారణంగా లక్షలాది మంది కస్టమర్ల KYC చెల్లుబాటు గడువు ముగిసినప్పటికీ బ్యాంకులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఇప్పుడు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు ఎటువంటి వెసులుబాటు ఇచ్చే పరిస్థితిలో లేవు. తక్కువ రిస్క్ కేటగిరీ కిందకు వచ్చే కస్టమర్‌లు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి KYCని అప్‌డేట్ చేసుకోవాలి. అదే సమయంలో అధిక-రిస్క్ కస్టమర్‌లు ప్రతి రెండు సంవత్సరాలకు వారి సమాచారాన్ని అప్‌డేట్ చేయాలి. ఇది కాకుండా నిద్రాణమైన లేదా నిష్క్రియ ఖాతాలను అన్‌ఫ్రీజ్ చేయడానికి లేదా మళ్లీ యాక్టివేట్ చేయడానికి కూడా KYC అప్‌డేట్ అవసరం.

KYC నిబంధనలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం బ్యాంకులకు మాత్రమే కాకుండా ఆర్థిక కంపెనీలు, మ్యూచువల్ ఫండ్‌లు, బ్రోకింగ్ హౌస్‌లు, డిపాజిటరీలకు కూడా తప్పనిసరి. డబ్బు లావాదేవీలలో మోసాలను నిరోధించడానికి, RBI KYC నియమాలను నవీకరించడాన్ని తప్పనిసరి చేసింది. KYC కాకుండా కొత్త సంవత్సరంలో ATMల నుంచి డబ్బును విత్‌డ్రా చేయడం ఖరీదైనదిగా మారుతుంది. ఉచిత లావాదేవీ ముగిసిన తర్వాత ఏటీఎంల నుంచి డబ్బు విత్‌డ్రా చేస్తే కస్టమర్లు మరిన్ని ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఉచిత లావాదేవీ ముగిసిన తర్వాత ఏటీఎంల నుంచి డబ్బు విత్ డ్రా చేసుకునేందుకు ఖాతాదారులు ఒక్కో లావాదేవీకి రూ.20 చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ ఛార్జీని రూ.21కి పెంచారు.

Tags:    

Similar News