Sonia Gandhi: సోనియా గాంధీకి మరోసారి కరోనా..

Sonia Gandhi: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మ‌రోసారి క‌రోనా బారిన ప‌డ్డారు.

Update: 2022-08-13 09:49 GMT

Sonia Gandhi: సోనియా గాంధీకి మరోసారి కరోనా..

Sonia Gandhi: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మ‌రోసారి క‌రోనా బారిన ప‌డ్డారు. ఈ విషయాన్ని పార్టీ ఎంపీ జైరాం రమేశ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని, ప్రొటోకాల్‌ ప్రకారం హోం ఐసోలేషన్‌లో ఉన్నారని జైరామ్‌ వెల్లడించారు. మరోవైపు కాంగ్రెస్‌ అధికారిక ట్విటర్‌ పేజీ సైతం ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఆమె త్వరగా కోలుకోవాలని ట్వీట్‌ చేసింది.

కాగా,రెండు నెలల వ్యవధిలో సోనియా గాంధీ కరోనా బారిన పడటం ఇది రెండోసారి. ఈ ఏడాది జూన్ లో క‌రోనా బారిన ప‌డిన సోనియా గాంధీ..వారం రోజుల వ్య‌వ‌ధిలోనే సోనియా కోలుకుంది. మరోవైపు,బుధవారం కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా కూడా మూడు నెలల్లో రెండవ సారి కరోనా బారినపడినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News