గుజరాత్‌లో ఘోర అగ్నిప్రమాదం

* రాజ్‌కోట్‌లోని శివానంద్‌ ఆస్పత్రిలో చెలరేగిన మంటలు * ఆరుగురు కరోనా బాధితులు మృతి * 27 మంది కోవిడ్ బాధితులను కాపాడిన ఫైర్ సిబ్బంది

Update: 2020-11-27 05:10 GMT

Fire Accident in Rajkot : గుజరాత్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. రాజ్‌కోట్‌లోని శివానంద్‌ ఆస్పత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురు కరోనా బాధితులు మృతి చెందారు. స్థానికుల సమాచారంతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది. మంటలను అదుపుచేశారు. మరో 27 మంది కోవిడ్ బాధితులను సురక్షితంగా కాపాడి. స్థానిక కోవిడ్‌ సెంటర్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. 

Tags:    

Similar News