కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో పొగరాయుళ్లకి చెక్ పెట్టారు. గుప్పు గుప్పున సిగరెట్లు ఊదిపారేసే పొగరాయుళ్లు ఇక నోరెళ్ల బెట్టాల్సిందే ఎక్సైజ్ డ్యూటీ పెంపుతో సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల ధరలు పెరగబోతున్నాయి. అంతేకాదు ఫర్నిచర్, చెప్పుల ధరలు పెరగబోతున్నాయి. వైద్య పరికరాలపై 5 శాతం హెల్త్ సెస్, ఆటో మెబైల్ విడి భాగాలపై కస్టమ్స్ సుంకం పెరిగింది. కిచెన్లో వాడే వస్తువులు, క్లే ఐరన్, స్టీలు, కాపర్ వస్తువుల రేట్లు పెరుగుతాయి.
అలాగే సోయా ఫైబర్, సోయా ప్రొటీన్ ధరలు కూడా పెరగబోతున్నాయి. స్కిమ్డ్ మిల్క్, వాల్ ఫాన్స్, టేబుల్ వేర్ ధరలు పెరుగుతాయి. ఇక విదేశాల నుంచి దిగుమతి చేసుకునే న్యూస్ ప్రింట్పై కేంద్రం పన్ను తగ్గించింది. అదే విధంగా ఎలక్ట్రిక్ వాహనాలు, మొబైల్ ఫోన్ల విడిభాగాలకు పన్ను తగ్గించింది. ప్లాస్టిక్ ఆధారిత ముడి సరుకు కస్టమ్స్ పన్నును సైతం తగ్గించింది.