శబరిమల ఆలయంలో భక్తులకు నో ఎంట్రీ

Update: 2020-06-11 11:55 GMT

శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప ఆలయ ద‌ర్శ‌నంపై ట్రావన్‌కోర్‌ దేవస్థానం బోర్డు కీలక ప్రకటన చేసింది. కరోనా నేపథ్యంలో భక్తుల నెలవారీ పూజల కోసం ఆలయాన్ని తెరువకూడదని నిర్ణయించింది. అలాగే ఆలయ ఉత్సవాన్ని కూడా రద్దు చేసింది. గురువారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు కేరళ దేవాదాయ శాఖ మంత్రి కదకంపల్లి సురేంద్రన్ మీడియాకు తెలిపారు.

అయితే, ఆలయంలో సాధారణంగా జరిగే పూజలు మాత్రం కొనసాగుతాయని తెలిపారు. కాగా, శబరిమల ఆలయాన్ని ఈ నెల 14న సాయంత్రం నెలపూజ కోసం తెరుస్తామని, 19న ఆలయ పండుగ ప్రారంభం అవుతుందని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఎన్ వాసు బుధవారం తెలిపారు. అంతలోనే వాటిని రద్దు చేస్తున్నట్టు మంత్రి ప్రకటించడం గమనార్హం.

 

 

Tags:    

Similar News