Omicron: దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు

Omicron: 1,270కు చేరిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య

Update: 2021-12-31 05:07 GMT

దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు

Omicron: దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు కలవరం సృష్టిస్తున్నాయి. ఇప్పటివరకు 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త వేరియంట్ వ్యాప్తి చెందినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక 12వందల 70 మందికి ఒమిక్రాన్ సోకినట్లు తెలిపింది. ఒమిక్రాన్ నుంచి 374 మంది కోలుకున్నారు. అత్యధికంగా మహారాష్ట్ర, ఢిల్లీలో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో 450, ఢిల్లీలో 320, కేరళలో 109 కేసులు రాగా రాజస్థాన్‌లో 69, తెలంగాణలో 62, తమిళనాడులో 46 కేసులు నమోదయ్యాయి.

Tags:    

Similar News