కశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు నేపథ్యంలో శ్రీనగర్ లో రద్దు చేసిన రైళ్లను తిరిగి పునరుద్ధరించేందుకు రైల్వే అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ఎడతెరిపిగా కురుస్తున్న మంచుతో శ్రీనగర్ రైల్వే స్టేషన్ మంచుతో నిండిపోయింది. పట్టాలపై దట్టంగా మంచు నిండుకోవడంతో పనులకు అంతరాయం కలిగింది. పట్టాలపై మంచు తొలగించే పనులను రైల్వే సిబ్బంది వేగవంతం చేశారు. రేపటి నుంచి రైళ్ల రాకపోకల పునరుద్ధరణ భాగంలో ట్రయల్ ట్రైయిన్స్ ను నడుపుతున్నారు. ముందుగా శ్రీ నగర్ నుంచి బారాముల్లా వరకు రైళ్లను నడపనున్నారు.