నేడు గుజరాత్ హైకోర్టులో రాహుల్గాంధీ కేసు విచారణ
Rahul Gandhi: సూరత్ కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళ్లిన రాహుల్గాంధీ
నేడు గుజరాత్ హైకోర్టులో రాహుల్గాంధీ కేసు విచారణ
Rahul Gandhi: నేడు గుజరాత్ హైకోర్టులో రాహుల్గాంధీ కేసు విచారణకు రానుంది. సూరత్ కోర్టు తీర్పుపై రాహుల్గాంధీ హైకోర్టుకు వెళ్లారు. పరువు నష్టం కేసులో జైలు శిక్షపై స్టే కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. రాహుల్ గాంధీకి పరువునష్టం కేసులో మార్చి 23న సూరత్ కోర్టు రెండేళ్ల శిక్ష విధించింది. పరువునష్టం కేసులో దోషిగా నిర్ధారించడంపై స్టే విధించాలని కోరుతూ రాహుల్ గాంధీ చేసిన అభ్యర్థనను సెషన్స్ కోర్టు తిరస్కరించింది. సూరత్ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పుపై రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు.