Pulwama Attack Anniversary: పుల్వామా అమరుల త్యాగాన్ని మర్చిపోం... నివాళులర్పించిన ప్రధాని మోడీ !
పుల్వామా నెత్తుటి మరకకు ఏడాది అయ్యింది. సరిగ్గా ఇదే రోజున జమ్ముకశ్మీర్లోని పుల్వామా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు భీకర దాడికి తెగబడ్డారు. ఆనాడు బస్సులో ప్రయాణిస్తున్న 40 సైనికులు వీర మరణం చెందారు. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన పుల్వామా ఘటనపై ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ నివాళులు అర్పించారు. వారి త్యాగాన్ని దేశం ఎన్నడూ మర్చిపోదన్నారు.
పుల్వామా అమరజవాన్లకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నివాళులు అర్పించారు. ప్రతీ భారతీయుడు ఇవాళ జవాన్లను స్మరించుకోవాలని.. వాలెంటైన్స్ డే ను వదిలిపెట్టి.. దేశం కోసం ధర్మం కోసం బాధ్యతగా మెలగాలని రాజాసింగ్ పిలుపునిచ్చారు.