గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో బ్రిడ్జ్‌ నిర్మాణం

Gujarath: ఇవాళ బ్రిడ్జ్‌ని లాంఛనంగా ప్రారంభించనున్న ప్రధాని మోడీ

Update: 2022-08-27 02:45 GMT

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో బ్రిడ్జ్‌ నిర్మాణం

Gujarath: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కేంద్ర ప్రభుత్వం నూతనంగా అటల్‌ బ్రిడ్జ్‌ పేరిట బ్రిడ్జ్‌ని నిర్మించింది. సబర్మతి నదిపై పాదచారుల కోసం మాత్రమే నిర్మించిన ఈ బ్రిడ్జ్‌ని ప్రధాని మోడీ ఇవాళ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో పలువురు బీజేపీ నేతలు ఈ బ్రిడ్జ్‌ విశిష్టతలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అభివృద్ధి చెందుతున్న భారత మౌలిక సదుపాయాల రంగంలో ఈ బ్రిడ్జ్‌కి ప్రత్యేక స్థానం దక్కడం ఖాయమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేర్కొన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి ఇదో నివాళిగా నిలుస్తుందని తెలిపారు.

Tags:    

Similar News