Narendra Modi: విపక్షాల విమర్శలకు ప్రధాని మోడీ స్ట్రాంగ్ కౌంటర్

Narendra Modi: ఈడీ కేసులు పెట్టడమే కాదు.. లక్షల కోట్లు వెలికితీస్తోంది

Update: 2024-04-15 15:42 GMT

Narendra Modi: విపక్షాల విమర్శలకు ప్రధాని మోడీ స్ట్రాంగ్ కౌంటర్

Narendra Modi: సీబీఐ, ఈడీ, ఐటీ తదితర దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తూ బీజేపీ భయపెడుతోందన్న విపక్షాల విమర్శలకు ప్రధాని మోడీ స్ట్రాంగ్ రిప్లయ్ ఇచ్చారు. విపక్షాలను ఈడీతో టార్గెట్ చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ దర్యాప్తు సంస్థలన్నీ స్వతంత్ర సంస్థలని క్లారిటీ ఇచ్చారు మోదీ. ఇప్పటి వరకు ఈడీ అరెస్ట్ చేసిన వారిలో 3 శాతం మందే రాజకీయ నాయకులన్నారు. మిగతా 97 శాతం మంది వ్యాపారవేత్తలు, అధికారులు ఉన్నారని మోడీ వివరించారు. ఈడీ కేసులు పెట్టడమే కాదు.. లక్షల కోట్ల రూపాయలు సీజ్ చేస్తోందని చెప్పారు. కోట్లాది రూపాయల అక్రమ సంపాదనను మాత్రమే ఈడీ అధికారులు సీజ్ చేస్తున్నారని మోడీ వివరించారు.

Tags:    

Similar News