సర్దార్ వల్లభాయ్ పటేల్ 144 వ జయంతి ఉత్సవాలు.. స్టాట్యూ ఆఫ్ యునిటీ దగ్గర మోడీ ఘన నివాళులు
ఉక్కుమనిషి.. దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. గుజరాత్లో పర్యటిస్తున్న ప్రధాని మోడీ నర్మదా నది తీరంలోని స్టాట్యూ ఆఫ్ యునిటీ విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. 144 వ జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకున్నారు. 2014 నుంచి అక్టోబర్ 31 న కేంద్రప్రభుత్వం జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా ఇవాళ నర్మదా తీరంలో భారీ ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.