PM Modi Wishes On Raksha Bandhan: దేశ పౌరులందరికీ రక్షా బంధన్ శుభాకాంక్షలు : ప్రధాని మోడీ

Update: 2020-08-03 08:20 GMT

దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం రక్షా బంధన్ (రాఖీ) పండుగను దేశ ప్రజలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మోడీ ట్విట్టర్ ద్వారా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో అత్యంత ఆదరణ కలిగిన పండుగల్లో రక్షాబంధన్‌ ఒకటి. అన్నాచెల్లెళ్ల అనుంబంధానిక ప్రతీక ఈ రాఖీ పండుగ. ఈ సందర్భంగా "రక్షా బంధన్ పండుగ సందర్భంగా పౌరులందరికీ శుభాకాంక్షలు" అని ప్రధాన మంత్రి ట్వీట్ చేశారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రక్షా బంధన్‌ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.''ఈ పండుగ సోదరులు, సోదరీమణులను కట్టిపడేసే ప్రేమ మరియు ఆప్యాయత యొక్క బలమైన సంబంధాలను పునరుద్ఘాటిస్తుంద''ని వెంకయ్యనాయుడు అన్నారు.






Tags:    

Similar News