PM Modi: ఈ నెల 14న వారణాసిలో నామినేషన్ వేయనున్న మోడీ

PM Modi: ప్రధానమంత్రి మోదీ ఈ నెల 14న వారణాసి లోక్‌సభ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

Update: 2024-05-04 16:00 GMT

PM Modi: ఈ నెల 14న వారణాసిలో నామినేషన్ వేయనున్న మోడీ

PM Modi: ప్రధానమంత్రి మోదీ ఈ నెల 14న వారణాసి లోక్‌సభ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న ఆయన ముందు రోజు 13వ తేదీన వారణాసిలో భారీ రోడ్‌ షోలో పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ యూపీ చీఫ్‌ అజయ్‌ రాయ్‌ను పోటీలో ఉంచింది. 2014, 2019 సాధారణ ఎన్నికల్లోనూ మోదీపై పోటీకి దిగిన అజయ్‌ ఓటమి పాలయ్యారు. అదేవిధంగా, రాజస్తాన్‌కు చెందిన కమెడియన్, ప్రధాని మోదీ స్వరాన్ని అనుకరించడంలో సిద్ధహస్తుడు అయిన శ్యామ్‌ రంగీలా కూడా వారణాసి నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.

Tags:    

Similar News