PM Modi: జవాద్‌ తుఫాన్‌పై ప్రధాని మోడీ సమీక్ష

PM Modi: తుఫాన్‌ సంసిద్ధత, ముందు జాగ్రత్తలపై అధికారులతో చర్చ

Update: 2021-12-02 08:45 GMT

జవాద్ తుఫాన్ పై ప్రధాని మోడీ సమీక్ష సమావేశం 

PM Modi: జవాద్‌ తుఫాన్‌పై ప్రధాని నరేంద్ర మోడీ సమీక్షా సమావేశం నిర్వహించారు. తుఫాన్‌ సంసిద్ధత, ముందు జాగ్రత్తలపై అధికారులతో చర్చిస్తున్నారు. ఇప్పటికే బెంగాల్‌, ఒడిశా, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. 32 ఎన్టీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించిన కేంద్రం సహాయక చర్యల కోసం ఆర్మీ, నేవీని సిద్ధం చేసింది. జవాద్‌ తుఫాన్‌ ఎఫెక్ట్‌తో అప్రమత్తమైన తూర్పు కోస్తా రైల్వే మూడు రోజులపాటు పలు రైళ్లను రద్దు చేసింది.

Tags:    

Similar News