ఈనెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
* ఉభయ సభలనుద్దేశించి ఈనెల 31న రాష్ట్రపతి ప్రసంగం
Parliament Budget Session: ఈనెల 31 నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలనుద్దేశించి ఈనెల 31న రాష్ట్రప్రతి ప్రసంగించనున్నారు. అదే రోజు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను ప్రవేశ పెట్టనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఏప్రిల్ 6న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి.