దీదీ థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలపై నీళ్లు చల్లిన శివసేన.. మమతకు మరోసారి శివసేన షాక్..

Sanjay Raut: కేంద్రంలో జాతీయ పార్టీల ఊసే లేకుండా ప్రత్యామ్నాయ కూటమి తయారీకి బెంగాల్ బెబ్బులి మమతా దీదీ..

Update: 2021-12-07 13:45 GMT

దీదీ థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలపై నీళ్లు చల్లిన శివసేన.. మమతకు మరోసారి శివసేన షాక్..

Sanjay Raut: కేంద్రంలో జాతీయ పార్టీల ఊసే లేకుండా ప్రత్యామ్నాయ కూటమి తయారీకి బెంగాల్ బెబ్బులి మమతా దీదీ చేస్తున్న ప్రయత్నాలపై శివసేన నీళ్లు చల్లింది. 2024లో ప్రతిపక్షాలు రాహుల్ సారధ్యంలోనే ఎన్నికలకు వెళతాయని కుండ బద్దలు కొట్టారు శివసేన అధినేత సంజయ్ రౌత్. రాహుల్ గాంధీ లేకుండా ప్రతిపక్ష కూటమిని ఊహించుకోవడం అసాధ్యం అన్నారాయన.

నిస్సందేహంగా రాహుల్ నేతృత్వంలోనే విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వస్తాయని అన్నారు. యూపీఏ ముగిసిన ముచ్చట అని మమతా బెనర్జీ వ్యాఖ్యలను శివసేన తిప్పికొట్టినట్లైంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ తో చర్చలు జరిపిన మమత కాంగ్రెస్ పైనా విమర్శలు చేశారు.

Tags:    

Similar News