Bengal: ప్రశాంతంగా కొనసాగుతున్న తొలిదశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

Bengal: ఉదయం ఏడింటి నుంచి పోలింగ్ ప్రారంభం

Update: 2021-03-27 07:23 GMT

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు (ఫైల్ ఫోటో)

Bengal: అసోం, బెంగాల్‌లో తొలిదశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం ఏడింటి నుంచి పోలింగ్ ప్రారంభం కాగా బూత్‌ల దగ్గర ఓటర్లు బారులు తీరారు. అయితే కొవిడ్ నిబంధనలు, జాగ్రత్తల నడుమ ఎన్నికలు నిర్వహిస్తుండటంతో పోలింగ్ కాస్త నెమ్మదిగా సాగుతోంది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఉదయం తొమ్మిది గంటల వరకు అసోంలో 8, బెంగాల్‌లో 7 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.

Tags:    

Similar News