మనసులను కదిలిస్తున్న సోషల్ మీడియా

Update: 2020-10-28 04:03 GMT

మంచో, చెడో ఏదో ఒక రెస్పాన్స్‌ త్వరగా రావాలంటే సోషల్‌ మీడియానే సరైన వేదిక. ఇందుకు నిదర్శనంగా నిలిచే సంఘటనలు ఎన్నో ! కొద్దిరోజుల క్రితం ఢిల్లీకి చెందిన బాబా కా దాబా ప్రతీ ఒక్కరి మనస్సులను కదిలిస్తే ఇప్పుడు అలాంటి సంఘటనే ఒకటి బెంగళూరులో జరిగింది. ఎండలో రోడ్డు మీద కూర్చుని మొక్కలు అమ్ముకుంటున్న వృద్ధుడికి సాయం చేయాల్సిందిగా కోరుతూ చేసిన ట్వీట్‌ నెటిజన్లతో పాటు సెలబ్రిటీలు, సిని ప్రముఖులను కూడా కదిలించింది. ఆ వ్యక్తి కోసం నెటిజన్లు గొడుగు, టేబుల్‌, కుర్చి వంటివి ఏర్పాటు చేయడమే కాకుండా అతడి దగ్గర మొక్కలు కొని మద్దతుగా నిలిస్తున్నారు.

Tags:    

Similar News