Odisha Assembly: అసెంబ్లీ సాక్షిగా బీజేపీ ఎమ్మెల్యే ఆత్మహత్యాయత్నం

Odisha Assembly: ధాన్యం కొనుగోలు చేయకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని ఎమ్మెల్యే ఆత్మహత్యకు యత్నించారు.

Update: 2021-03-13 07:33 GMT
బీజేపీ ఎమ్మెల్యే (ఫోటో: ఒడిశా అసెంబ్లీ)

Odisha Assembly: ధాన్యం కొనుగోలు చేయకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని బిజెపి ఎమ్మెల్యే సుభాష్ పానిగ్రాహి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన ఒడిశా అసెంబ్లీలో చోటు చేసుకుంది. శాసనసభలో సీరియస్‌గా చర్చ జరుగుతున్న వేళ ఓ బీజేపీ ఎమ్మెల్యే ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. ఒడిశాలో జరిగిందీ ఘటన. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సహకార, పౌరసరఫరాల శాఖ మంత్రి రాణేంద్ర ప్రతాప్ స్వయిన్ అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో పోడియం వద్దకు చేరుకున్న బీజేపీ దేవ్‌గఢ్ ఎమ్మెల్యే సుభాష్ పాణిగ్రాహి తన వెంట తెచ్చుకున్న శానిటైజర్ బాటిల్ మూత తీసి తాగే ప్రయత్నం చేశారు. వెంటనే అప్రమత్తమైన ఇతర సభ్యులు ఆయన నుంచి సీసా లాక్కోవడంతో ప్రమాదం తప్పింది.

ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో...

ధాన్యం కొనుగోలు చేయకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని ఎమ్మెల్యే ఇది వరకే హెచ్చరించారు. అనుకున్నట్టే ఆత్మహత్యకు యత్నించారు. తన నియోజకవర్గమైన దేవ్‌గఢ్ జిల్లాలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని, అక్కడి రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారని గత నెల 26న అసెంబ్లీలో మాట్లాడుతూ సుభాష్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయినా పెద్దగా స్పందన రాకపోవడంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు సదరు ఎమ్మెల్యే తెలిపారు.

Tags:    

Similar News