రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. తెలుగురాష్ట్రాల్లో ఛాన్స్ వీరికేనా?
2020 రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల అయింది. దీంతో ఇప్పటికే కొంతమంది అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియను ప్రారంభించారు.
2020 రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల అయింది. దీంతో ఇప్పటికే కొంతమంది అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. నేటి (మార్చి 6)నుండి మార్చి 13 వరకు నామినేషన్ దాఖలు చేయవచ్చు. అదే సమయంలో మార్చి 16 న నామినేషన్ పత్రాలను పరిశీలిస్తారు మరియు మార్చి 18 లోగా నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. దీని తరువాత మార్చి 26న ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది.
గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థుల నామినేషన్ కోసం 8 మంది ఎమ్మెల్యేలు ప్రతిపాదకులుగా ఉండాల్సి ఉండగా, స్వతంత్రులు 10 మంది ఎమ్మెల్యేలను ప్రతిపాదకులుగా చేయాల్సి ఉంటుంది. కాగా ఇప్పటికే కొన్ని పార్టీలు అభ్యర్థులను దాదాపు ఎంపిక చేసినట్టు టాక్ వినబడుతోంది. వాస్తవానికి ఏపీలో మొత్తం నాలుగు స్థానాలు ఖాళీ అవుతున్నాయి.. అందులో మొహద్ అలీ ఖాన్, టి సుబ్బరామి రెడ్డి, కె. కేశవ రావు, తోటా సీతారామ లక్ష్మి పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్ 9న ముగుస్తోంది. దీంతో మంత్రులు మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, పారిశ్రామికవేత్త అయోధ్య రామి రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి పరిమల్ నథ్వానీ, మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు, మాజీ ఎమ్మెల్యేలు బీద మస్తాన్ రావుల పేర్లను సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం..
అలాగే తెలంగాణలో కూడా రెండు సీట్లు ఖాళీ అవుతున్నాయి.. ఈ రెండు సీట్లకు పోటీ కూడా బాగానే ఉంది. మాజీ ఎంపీలు కల్వకుంట్ల కవిత, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వినోద్, కడియం శ్రీహరి ల పేర్లు ప్రధానంగా వినబడుతున్నాయి. ఇక జార్ఖండ్లో 2 సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఈ సీట్లలో ఒకటి జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం) చీఫ్ షిబు సోరెన్కు వెళ్లడం దాదాపు ఖాయం అయింది. రెండవ సీటుపై ఇంకా క్లియర్ సమాచారం రాలేదు.
రాజ్యసభ స్థానాలు ఖాళీ అవ్వనున్న రాష్ట్రాలు మరియు సీట్లు..
♦ మహారాష్ట్ర - 7
♦ ఒడిశా - 4
♦ తమిళనాడు - 6
♦ పశ్చిమ బెంగాల్ - 5
♦ ఆంధ్రప్రదేశ్ - 4
♦ తెలంగాణ - 2
♦ అస్సాం -3
♦ బీహార్- 5
♦ ఛత్తీస్గడ్ - 2
♦ గుజరాత్ -4
♦ హర్యానా - 2
♦ హిమాచల్ ప్రదేశ్ -1
♦ జార్ఖండ్ - 2
♦ మధ్యప్రదేశ్ - 3
♦ మణిపూర్ - 1
♦ రాజస్థాన్ - 3
♦ మేఘాలయ - 1