Nirbhaya Case: సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసిన పవన్ కుమార్

నిర్భయ కేసులో నిందితుడిగా ఉన్న పవన్ కుమార్ మరో నాటకానికి తెరతీశాడు. తాజాగా సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. ఇందులో మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని పేర్కొన్నాడు.

Update: 2020-02-28 12:32 GMT
నిర్భయ దోషి పవన్ కుమార్ (ఫైల్ ఫోటో)

నిర్భయ కేసులో నిందితుడిగా ఉన్న పవన్ కుమార్ మరో నాటకానికి తెరతీశాడు. తాజాగా సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. ఇందులో మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని పేర్కొన్నాడు. అలాగే , దిగువ కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్‌పై స్టే ఇవ్వాలని పవన్‌ కుమార్ గుప్తా డిమాండ్ చేశారు. అంతేకాదు పవన్ తన పిటిషన్లో నేరం జరిగినప్పుడు తాను మైనర్ అని పేర్కొన్నాడు.
 ఇప్పటికే వీరి ఉరిశిక్ష రెండు సార్లు వాయిదా పడింది. ఈ క్రమంలో ఉరికి నాలుగు రోజుల ముందు పవన్ కుమార్ క్యూరేటివ్ పిటిషన్ ను దాఖలు చేయడం కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఉరిశిక్ష నుంచి తప్పించుకోవడానికే అతను ఈ పిటిషన్ దాఖలు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి.

కాగా పవన్ కుమార్ తో సహా నలుగురు దోషులను ఉరితీయాలని ఇప్పటికే ఢిల్లీ హైకోర్ట్ డెత్ వారెంట్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. మార్చి 3న నలుగురు నిందితులను ఉరి తీయనున్నారు. ఈ కేసులో చట్టపరమైన చర్యలు పెండింగ్‌లో ఉన్నందున దోషుల ఉరిశిక్ష గతంలో రెండు సార్లు వాయిదా పడింది. ఈ క్రమంలో మరోసారి సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఎటువంటి తీర్పు వస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Tags:    

Similar News