Navjot Singh Sidhu: లఖీంపూర్ ఖేరిలో సిద్ధూ నిరాహార దీక్ష

*విచారణకు హాజరైన లఖీంపూర్ నిందితుడు ఆశిష్ మిశ్రా *తన దీక్షను విరమిస్తున్నట్లు సిద్ధూ ప్రకటన

Update: 2021-10-09 09:39 GMT

దీక్ష విరమించిన పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ(ఫైల్ ఫోటో)

Navjot Singh Sidhu: పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ దీక్ష విరమించారు. లఖీంపూర్ ఘటనలో నిందితుడిగా ఉన్న కేంద్రమంత్రి కొడుకును అరెస్ట్ చేసేంతవరకు నిరాహార దీక్షకు దిగారు. లఖీంపూర్ ఘటనలో మరణించిన జర్నలిస్ట్ రామన్ కశ్యప్ నివాసం వద్ద సిద్దూ శుక్రవారం నిరాహార దీక్షకు కూర్చున్నారు. అయితే ఉత్తరప్రదేశ్ పోలీసుల సమన్లు అందుకున్న ఆశిష్ మిశ్రా క్రైమ్ బ్రాంచ్ ఆఫీసులో విచారణకు హాజరయ్యాడు. దీంతో తన దీక్షను విరమిస్తున్నట్లు సిద్దూ ప్రకటించారు.

Tags:    

Similar News