ఇసుక తుపాను బీభత్సం

Update: 2019-04-09 13:18 GMT

కొంతకాలంగా రాజస్థాన్‌లో ఇసుక తుపానులు బీభత్సం సృష్టిస్తున్నాయి. తాజాగా రాజస్థాన్‌ ఎడారి ప్రాంతమైన చురు పట్టణంపై ఇసుక తుపాను విజృంబించింది. మేఘాలను తాకుతుందా అనిపిస్తూ భారీగా ఇసుక దుమ్ముగా మారి తుపానుగా దూసుకువచ్చింది. ఆ దృశ్యాన్ని చూసిన ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. తుపానులో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పంటలకు మాత్రం నష్టం వాటి ల్లింది. ఐతే, సినిమాల్లో చూపించినట్లుగా భయంకరంగా ఇసుక తుపాను కమ్మేయడంతో ప్రజలు వణికిపోయారు. ఆన్ లైన్‌లో ఆ వీడియో చూస్తే, అదేదో గ్రాఫికల్ జిమ్మిక్ అనిపించవచ్చు. కానీ, అది నిజంగా జరిగిందని అధికారులు తెలిపారు. 

Similar News