Maoist: కలప వ్యాపారుల ద్రోహం వల్లే దొరికారు: హిడ్మా, శంకర్ పట్టుబడటంపై మావోయిస్టుల సంచలన లేఖ
Maoist: మావోయిస్టు అగ్ర నాయకుడు హిడ్మా మరణంపై ఆ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది.
Maoist: కలప వ్యాపారుల ద్రోహం వల్లే దొరికారు: హిడ్మా, శంకర్ పట్టుబడటంపై మావోయిస్టుల సంచలన లేఖ
Maoist: మావోయిస్టు అగ్ర నాయకుడు హిడ్మా మరణంపై ఆ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది. హిడ్మాది బూటకపు ఎన్కౌంటరేనని (Fake Encounter) దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ (DKSZC) ప్రతినిధి వికల్ప్ పేరుతో మావోయిస్టు పార్టీ ఒక లేఖను విడుదల చేసింది.
లేఖలోని ముఖ్యాంశాలు:
హిడ్మా మరణం పూర్తిగా బూటకపు ఎన్కౌంటరేనని మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఆరోపించింది. అనారోగ్యంతో బాధపడుతున్న హిడ్మా, మరో నాయకుడు శంకర్తో కలిసి చికిత్స నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడకు వెళ్లారని లేఖలో పేర్కొన్నారు.
ఏపీకి చెందిన కొందరు కలప వ్యాపారుల (Timber Merchants) సహాయంతో వీరు ప్రయాణించగా, వారి ద్రోహం కారణంగానే పోలీసులు వీరిని పట్టుకోగలిగారని మావోయిస్టులు ఆరోపించారు. హిడ్మా, శంకర్లను పట్టుకున్న పోలీసులు వారం రోజుల పాటు చిత్రహింసలకు గురిచేసి, ఆ తర్వాత వారిని చంపేశారని లేఖలో పేర్కొన్నారు.
ఈ ఘటనపై తక్షణమే సమగ్ర దర్యాప్తు (Comprehensive Investigation) చేపట్టాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసింది.