Mehul Choksi: ఫలిస్తున్న భారత్ న్యాయపోరాటం
Mehul Choksi: ఆర్థిక నేరగాడు మెహుల్ ఛోక్సీని భారత్కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు అనుమతి ఇచ్చింది.
Mehul Choksi: ఫలిస్తున్న భారత్ న్యాయపోరాటం
Mehul Choksi: ఆర్థిక నేరగాడు మెహుల్ ఛోక్సీని భారత్కు అప్పగించేందుకు బెల్జియం కోర్టు అనుమతి ఇచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ను సుమారు రూ.13,000 కోట్లకు పైగా మోసం చేసిన కేసులో ఇతగాడు ప్రధాన నిందితుడు. తమ దేశంలో తలదాచుకుంటున్న ఛోక్సీని భారత్కు అప్పగించడం సరైనదేనని పేర్కొంటూ తీర్పు వెలువరించింది అక్కడి న్యాయస్థానం.
ఇది ఒక రకంగా భారత్కు పెద్ద విజయంగా చెప్పవచ్చు. అతన్ని భారత్కు రప్పించేందుకు ప్రయత్నాలు ఇప్పటికే తీవ్రమయ్యాయి, అయితే అనారోగ్యాన్ని సాకుగా చూపి భారత్కు తిరిగి రాకుండా తప్పించుకునేందుకు చోక్సీ అనేక ఎత్తుగడలు వేస్తున్నాడు.