ముంబైలోని ఓ బిజినెస్ సెంటర్‌లో అగ్నిప్రమాదం

ముంబైలోని ఓ వాణిజ్యభవనంలో అగ్నిప్రమాదం జరిగింది. జోగేశ్వరి వెస్ట్‌ ఏరియాలో గల JMSలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.

Update: 2025-10-23 07:50 GMT

ముంబైలోని ఓ వాణిజ్యభవనంలో అగ్నిప్రమాదం జరిగింది. జోగేశ్వరి వెస్ట్‌ ఏరియాలో గల JMSలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దాంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పుతున్నారు. భవనంపై అంతస్తులు పలువురు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకురెస్క్యూ టీమ్స్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

Tags:    

Similar News