Encounter: ఢిల్లీ రోహిణిలో ఎన్కౌంటర్.. బిహార్కు చెందిన నలుగురు గ్యాంగ్స్టర్లు హతం
Encounter: దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం చోటుచేసుకుంది.
Encounter: ఢిల్లీ రోహిణిలో ఎన్కౌంటర్.. బిహార్కు చెందిన నలుగురు గ్యాంగ్స్టర్లు హతం
Encounter: దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం చోటుచేసుకుంది. రోహిణి ప్రాంతంలో గ్యాంగ్స్టర్లు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు రంగంలోకి దిగిన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బిహర్ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్కౌంటర్లో బిహార్కు చెందిన నలుగురు బడా గ్యాంగ్స్టర్లు హతమయ్యారు.
మృతుల్లో గ్యాంగ్లీడర్ రంజక్ పాఠక్, బిమ్లేష్ మహతో అలియాస్ బిమ్లేష్ సాహ్ని, మనీష్ పాఠక్, అమన్ ఠాకూర్ ఉన్నారు. ఈ ఎన్కౌంటర్కు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.