Lok Sabha: లోక్‌సభలో విపక్ష సభ్యుల ఆందోళన.. SIR చర్చకు సభ్యుల డిమాండ్

Lok Sabha: లోక్ సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. లోక్ సభ సమావేశాలు ప్రారంభం అయిన కొద్దిసేపటికే విపక్షాలు ఆందోళనతో 12 గంటలకు వాయిదా పడింది.

Update: 2025-12-01 08:58 GMT

Lok Sabha: లోక్ సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. లోక్ సభ సమావేశాలు ప్రారంభం అయిన కొద్దిసేపటికే విపక్షాలు ఆందోళనతో 12 గంటలకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైనప్పటికీ విపక్షాల ఆందోళన కొనసాగించారు. SIR ఢిల్లీ బంబా పేలుళ్లు, ఢిల్లీలో కాలుష్యం ఇతర అంశాలపై చర్చ జరపాలని సభ్యులు పట్టు పట్టారు. దీంతో సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా.

అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని స్పీకర్ ఓంబిర్లా విపక్షాలకు స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాలకు సహకరించాలంటూ సూచించారు. అయినా విపక్ష సభ్యులు మాత్రం తాము ప్రతిపాదించిన అంశాలపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. దీంతో విపక్ష ఎంపీల తీరుతో స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 

Tags:    

Similar News