లింగమనేని ప్రాజెక్ట్స్‌ దివాలా వార్తలపై లింగమనేని రమేష్‌ క్లారిటీ

Update: 2019-11-18 13:58 GMT
లింగమనేని రమేష్‌

లింగమనేని ప్రాజెక్ట్స్‌ దివాలా వార్తలపై లింగమనేని రమేష్‌ క్లారిటీ ఇచ్చారు. తమ సంస్థను దివాలాగా ప్రకటించాలని తామెప్పుడూ కోరలేదన్నారు. జర్మనీకి చెందిన సంస్థతో ఎయిర్‌ కోస్తా ఒప్పందంలో సమస్యలొచ్చాయని, వాటిని పరిష్కరించుకునే లోపే సదరు సంస్థ లా ట్రైబ్యునల్‌ లో దివాలా పిటిషన్‌ వేసిందని తెలిపారు.

జర్మన్‌ సంస్థ పిటిషన్‌ ఆధారంగా కంపెనీస్‌ లా ట్రైబ్యునల్‌ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని, ఈ వ్యవహారంతో ఎల్‌ఈపీఎల్‌ లోని ఇతర కంపెనీలకు ఎలాంటి సంబంధం లేదని వివరించారు. సంస్థలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని, గతంలోనూ రుణ దాతలకు చెల్లింపులు చేయలేని పరిస్థితి ఎప్పుడూ లేదని చెప్పారు లింగమనేని రమేష్‌.

Full View


 


Tags:    

Similar News