Kedarnath: రేపు తెరుచుకోనున్న కేదార్‌నాథ్‌ తలుపులు.. పూలతో ఆలయం అలంకరణ

Kedarnath: పూజలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య.. తలుపులు తెరవనున్న ఆలయ కమిటీ

Update: 2024-05-09 05:28 GMT

Kedarnath: రేపు తెరుచుకోనున్న కేదార్‌నాథ్‌ తలుపులు.. పూలతో ఆలయం అలంకరణ

Kedarnath: మహా శివుడి పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయం రేపు తెరుచుకోనుంది. పూజలు, వేద మంత్రోచ్ఛారణలతో ఆలయ తలుపులు తెరవనున్నట్లు శ్రీ బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయ కమిటీ తెలిపింది. తలుపులు తెరవడానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా ఆలయాన్ని అత్యంత సుందరంగా పూలతో అలంకరిస్తున్నారు. కాగా తీవ్ర మంచు కారణంగా ఆలయంలో శీతాకాలంలో మూసివేస్తారు.

Tags:    

Similar News