HD Kumaraswamy: తండ్రి దేవెగౌడ తర్వాత అంతటి మార్గదర్శి కేసీఆరే..
HD Kumaraswamy: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో గ్యాప్ వచ్చిందన్న ఊహాగానాలను కొట్టిపారేశారు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి.
HD Kumaraswamy: తండ్రి దేవెగౌడ తర్వాత అంతటి మార్గదర్శి కేసీఆరే..
HD Kumaraswamy: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో గ్యాప్ వచ్చిందన్న ఊహాగానాలను కొట్టిపారేశారు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి. రాయచూర్లో జరిగిన పంచరత్న యాత్రలో నారాయణపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డితో కలిసి పాల్గొన్న ఆయన రాజకీయాల్లో తన తండ్రి దేవెగౌడ తర్వాత అంతటి మార్గదర్శి కేసీఆరే అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో 24 జిల్లాల రైతులకు మేలు జరుగుతోందన్నారు. మిషన్ భగీరథ పథకంతో తెలంగాణలోని ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు లభిస్తోందని తెలిపారు. కర్ణాటకలో తాము అధికారంలోకి వస్తే కేసీఆర్ స్ఫూర్తితో పథకాలు అమలు చేస్తామన్నారు కుమారస్వామి. కాంగ్రెస్, బీజేపీలు కర్ణాటక అభివృద్ధిని వెనక్కి నెట్టాయని ఆరోపించారు.