దేశంలో కొనసాగుతున్న ఉపఎన్నికల పర్వం.. 8 అసెంబ్లీ స్థానాలకు జరుగుతోన్న బై ఎలక్షన్స్
దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల పర్వం కొనసాగుతోంది. ఇవాళ 8 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి.
దేశంలో కొనసాగుతున్న ఉపఎన్నికల పర్వం.. 8 అసెంబ్లీ స్థానాలకు జరుగుతోన్న బై ఎలక్షన్స్
దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల పర్వం కొనసాగుతోంది. ఇవాళ 8 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. వేర్వేరు కారణాలతో ఖాళీ అయిన 8 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ ఉప ఎన్నికలకు నవంబర్ 14న ఫలితాలు వెలువడనున్నాయి.
తెలంగాణలోని జూబ్లీహిల్స్, జమ్ముకశ్మీర్లోని బుద్గాం, నగ్రోటా, రాజస్థాన్ అంటా నియోజకవర్గానికి, జార్ఖండ్ ఘట్సిలా, పంజాబ్లోని తార్న్ తరణ, ఒడిశా నుపవాడా, మిజోరంలోని దంపా నియోజకవర్గాలకు బై ఎలక్షన్స్ జరగుతున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో జెండా పాతేది ఎవరనే దానిపై ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.