Himachal Pradeshలో లోయలో పడిన ఆర్టీసీ బస్సు.. ఐదుగురి మృతి

Update: 2020-03-11 04:33 GMT

హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం చంబా జిల్లాలో ఉత్తరాఖండ్ నుంచి వస్తున్న బస్సు కొండపై నుంచి పడటంతో ఐదుగురు మృతి చెందగా, 35 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మంగళవారం ఉదయం 6.45 గంటల సమయంలో చంబా సదర్ ప్రాంతంలోని చెహ్లి గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. హిమాచల్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (హెచ్‌ఆర్‌టిసి) బస్సు నిన్న ఉదయం ఉత్తరాఖండ్ నుంచి 40 మంది ప్రయాణికులతో చంబాకు బయలుదేరింది.

చంబా జిల్లా సమీపంలోని జార్జ్ లోయ సమీపంలోకి రాగానే అదుపుతప్పి ఒక్కసారిగా లోయలోకి జారిపోయి బోల్తాపడింది. దీంతో అక్కడికక్కడే ఐదుగురు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. బస్సులో చిక్కుకున్న క్షతగాత్రులను అగ్నిమాపక దళ సిబ్బంది, స్థానికుల సహాయంతో బయటికి తీసుకువచ్చారు. వారిని చికిత్స కోసం చంబా వైద్య కళాశాలకు పంపినట్లు పోలీసులు తెలిపారు. మృతులను యోగేశ్ కుమార్ (47), పూజా కుమారి (28), రాజీవ్ కుమార్ (37), మణిరామ్ (33), దావత్ అలీ (30) గా గుర్తించినట్లు వెల్లడించారు.  

Tags:    

Similar News