MLC Kavitha: ఇవాళ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ

MLC Kavitha: పిటిషన్‌పై విచారణ చేపట్టనున్న రౌస్ అవెన్యూ కోర్టు

Update: 2024-04-01 02:04 GMT

 MLC Kavitha: ఇవాళ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ

MLC Kavitha: ఇవాళ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. లిక్కర్ కేసులో అరెస్టై తిహార్ జైల్లో ఉన్న కవిత...తన చిన్న కుమారుడి పరీక్షలు రాస్తున్నాడని...ఈ నేపథ్యంలో తనకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. ఇక మరోపక్క ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ కస్టడీ కూడా ఈరోజుతో ముగియనుంది. కాసేపట్లో కోర్టులో కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు హాజరుపర్చనున్నారు.

Tags:    

Similar News