Rajasthan: రాజస్థాన్లో పట్టాలు తప్పిన సూపర్ఫాస్ట్ రైలు.. గాయపడ్డ ప్రయాణీకులు
Rajasthan: ఇంజిన్తో పాటు పట్టాలు తప్పిన మరో 4కోచ్లు
Rajasthan: రాజస్థాన్ అజ్మర్లో ఓ సూపర్ ఫాస్ట్ రైలు పట్టాలు తప్పింది. మాదార్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనలో పలువురు ప్రయాణీకులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. సబర్మతి -ఆగ్రా సూపర్ ఫాస్ట్ రైలు ఇంజిన్తో పాటు నాలుగు కోచ్లు పట్టాలు తప్పాయి. అప్రమత్తమైన రైస్క్యూ బృందాలు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అజ్మీర్ స్టేషన్కు తరలించారు. ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరలేదని సమాచారం.