FASTag : ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ కు భారీ స్పందన.. 4రోజుల్లోనే దేశంలోనే టాప్ యాప్గా గుర్తింపు
FASTag : ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ కు భారీ స్పందన.. 4రోజుల్లోనే దేశంలోనే టాప్ యాప్గా గుర్తింపు
FASTag : ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ కు భారీ స్పందన.. 4రోజుల్లోనే దేశంలోనే టాప్ యాప్గా గుర్తింపు
FASTag : దేశంలో ఇప్పుడు అంతా డిజిటల్ మయం. టోల్ ప్లాజాల వద్ద సమయం వృథా కాకుండా తీసుకొచ్చిన ఫాస్టాగ్ సేవలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో 2025 ఆగస్టు 15న కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన ఫాస్టాగ్ యాన్యువల్ పాస్కు కూడా అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ పాస్ ప్రారంభించిన కేవలం నాలుగు రోజుల్లోనే దేశవ్యాప్తంగా 5 లక్షల మందికి పైగా దీనిని కొనుగోలు చేశారు. ఈ పాస్ను అత్యధికంగా తమిళనాడులో కొనుగోలు చేయగా, ఆ తర్వాత కర్ణాటక, హర్యానా రాష్ట్రాలు ఉన్నాయి.
ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ విజయంతో పాటు, రాజ్మార్గ్ యాత్ర యాప్ కూడా పెద్ద విజయం సాధించింది. గూగుల్ ప్లే స్టోర్లో ఈ యాప్ మొత్తం ర్యాంకింగ్లో 23వ స్థానంలో, ట్రావెల్ కేటగిరీలో రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఈ యాప్ను 15 లక్షలకు పైగా ప్రజలు డౌన్లోడ్ చేసుకున్నారు. 4.5 స్టార్ల రేటింగ్ సాధించి, కేవలం నాలుగు రోజుల్లోనే దేశంలో అత్యుత్తమ ప్రభుత్వ యాప్గా నిలిచింది.
ఏమిటి ఈ ఫాస్టాగ్ యాన్యువల్ పాస్?
* ఏడాది పాటు ఒకేసారి చెల్లింపు: ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ప్రత్యేకత ఏమిటంటే, ఒకేసారి రూ. 3,000 చెల్లించి ఏడాది పొడవునా (లేదా 200 టోల్ పాస్ అయ్యేవరకు) టోల్ ప్లాజాల వద్ద ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ప్రయాణించవచ్చు. ఇది బార్ బార్ రీఛార్జ్ చేయాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది.
* ఎక్కడ పని చేస్తుంది?: ఈ పాస్ దేశవ్యాప్తంగా దాదాపు 1,150 టోల్ ప్లాజాలలో పనిచేస్తుంది.
* ఎక్కడ కొనాలి?: ఈ పాస్ను రాజ్మార్గ్ యాత్ర యాప్ లేదా ఎన్హెచ్ఏఐ వెబ్సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. పాస్ కొనుగోలు చేసిన రెండు గంటల్లోనే అది యాక్టివ్ అవుతుంది.