కేంద్రం ఆహ్వానంపై రైతు సంఘాల తర్జన భర్జనలు

* చర్చలు జరపాలా వద్దా? ఎటూ తేల్చుకోలేని నేతలు * సాయంత్రం 5.30కి సింఘ్ సరిహద్దు దగ్గర మీడియా సమావేశం * చర్చలకు వెళ్లేది లేనిదీ తేల్చి చెబెతామంటున్న రైతు సంఘాలు * ఢిల్లీలో 23 రోజులకు పైగా సాగుతున్న రైతు సంఘాల ఆందోళనలు

Update: 2020-12-23 12:59 GMT

ఢిల్లీ సరిహద్దుల్లో రైతు సంఘాల ఆందోళనలు, ధర్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. చర్చలకు రమ్మని కేంద్రం పంపిన ఆహ్వానంపై వెళ్లాలా వద్దా అనే సంశయంలో పడిపోయారు అన్నదాతలు. కేంద్ర ఆహ్వానంపై ఎలా స్పందించాలన్న అంశంపై కొద్ది సేపటి క్రితమే రైతు సంఘాలు భేటీ అయ్యాయి. కేంద్రం పంపిన లేఖకు జవాబు ఏం ఇవ్వాలన్న అంశంపై తమ నిర్ణయాన్ని ఈ సాయంత్రం 5.30కి సింఘ్ సరిహద్దు దగ్గర వెల్లడిస్తామని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు.

Tags:    

Similar News