Delhi Liqour Scam: మనీష్ సిసోడియాను మరో 7రోజులు కస్టడీ ఇవ్వాలని కోరిన ఈడీ
Delhi Liqour Scam: లిక్కర్ కేసు కీలక దశలో ఉందని..7 రోజులు కస్టడీ కావాలి
Delhi Liqour Scam: మనీష్ సిసోడియాను మరో 7రోజులు కస్టడీ ఇవ్వాలని కోరిన ఈడీ
Delhi Liqour Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దూకుడు పెంచింది. మనీష్ సిసోడియాను 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఈడీ వేసిన పిటిషన్పై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. మనీష్ సిసోడియాను మరికొందరితో కలిపి కన్ఫ్రంటేషన్ చేయాల్సి ఉందని ఈడీ అధికారులు వాదించారు. లిక్కర్ కేసు కీలక దశలో ఉందని..అందుకే మరో వారం రోజుల పాటు కస్టడీని పొడిగించాలని రౌస్ అవెన్యూ కోర్టును ఈడీ అధికారులు కోరారు. అయితే వాదనలు విన్న కోర్టు...తీర్పును 4 గంటలకు వాయిదా వేశారు.