Delhi: ఆప్‌-బీజేపీ కార్పొరేటర్ల మధ్య గందరగోళం.. మరోసారి నిలిచిపోయిన మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక

Delhi: మరోసారి నిలిచిపోయిన మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక

Update: 2023-01-24 12:34 GMT

Delhi: ఆప్‌-బీజేపీ కార్పొరేటర్ల మధ్య గందరగోళం.. మరోసారి నిలిచిపోయిన మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక

Delhi: ఢిల్లీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికల్లో సందిగ్ధత నెలకొంది. మున్సిపల్‌ ఎన్నిక సందర్భంగా ఆప్‌, బీజేపీ కార్పొరేటర్ల మధ్య ఆందోళనలతో సమావేశం వాయిదా పడింది. మున్సిపల్‌ ఎన్నికల తర్వాత సమావేశమయ్యే మొదటి సభలోనే మేయర్‌, డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకోవాల్సి ఉంటుంది. సభలో గందరగోళం నెలకొనడంతో మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక ప్రక్రియ నిలిచిపోయింది. మున్సిపల్‌ ఎన్నికల్లో 134 వార్డుల్లో ఆప్‌ గెలవగా.. బీజేపీ 104 వార్డులకు మాత్రమే పరిమితమైంది.

Tags:    

Similar News